ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
తెలుగునాడు, అమరావతి :
ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. 18,55,760 మంది తల్లులకు ఒకే బిడ్డ. 14,55,322 మంది తల్లులకు ఇద్దరు బిడ్డలు. అంటే 29,10,644 మంది పిల్లలు. 2,10,684 మంది తల్లులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంటే ఆ బిడ్డల సంఖ్య 6,32,052. అదే విధంగా 20,053 మంది తల్లులకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారి సంఖ్య 80, 212. ఏ మాటైతే నేను చెప్పానో అదే విధంగా తల్లికి వందనం ఇస్తున్నాను. ఇది జనాభా యాజమాన్య వ్యవస్థ కు ఒక ముందుడుగు.