అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్
న్యూ డిల్లీ :
అమెరికాలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే విమానం ఇంజిన్ నుంచి మంటలు, పొగలు వచ్చాయి దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతోపెను ప్రమాదం తప్పినట్లైంది.అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం బుధవారం ఉదయం 8:11 గంటలకు లాస్వేగాస్ ఎయిర్పోర్టు నుంచి నార్త్ కరోలినాకు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత సమస్య తెలెత్తింది. గాల్లో ఉండగా ఇంజిన్ నుంచి మంటలు, పొగలు వచ్చాయి. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. 8:20కి లాస్వేగాస్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్
ఆ సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.