పసుపు బోర్డు లోగో ఆవిష్కరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

నిజామాబాద్ ప్రజలు గర్వించాల్సిన సమయం ఇది అని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో కిషన్ రెడ్డి పర్యటించారు. పసుపు బోర్డు లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 29న పసుపు బోర్డు ఆఫీస్ ను హోం మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని, పలు రాష్ట్రాలు కోరినా కేంద్రం నిజామాబాద్ కే బోర్డు కేటాయించిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐతో విచారణ జరిపించాలని, ట్యాపింగ్ చేసింది పోలీసులే కాబట్టి సిబిఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ తో సిఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. పోలీసులపై పోలీసులే దర్యాప్తు జరిపే పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు.