కరాటే మాస్టర్ రవికుమార్ గౌడ్ కు సన్మానం మరియు ” అవార్డు అందచేశారు ..
విశాఖపట్నం :
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం గాజువాక లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో కుషాయిగూడ మరియు చర్లపల్లి చెందిన ఛాంపియన్ షాటోఖాన్ మార్షల్ట్స్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచారు. * కరాటే పోటీలలో * ఇందులో కట విభాగం లో ఎనిమిది బంగారు పతకాలు, ఒకటి వెండి పతకాలు, మరియు రెండు కాంస్య పతకాలు అలాగే కుమిటే విభాగం లో ఏడు బంగారు పతకాలు ఒకటి వెండి పతకాలు మరియు మూడు కాంస్య పతకాలు సాధించారని ఛాంపియన్ షాటోఖాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ బుడిగే రవికుమార్ గౌడ్ తెలిపారు. వీరిలో శ్రీశాంత్ గౌడ్, ప్రభావ్, విష్ణు, శ్రీనిష్, ఉదయశ్రీ, అనన్య, శతన్వి, మనస్విని బంగారు పతకాలు సాధించారు.* అలాగే రుద్ర వెండి పతకాలు సాధించారు * అలాగే కారుణ్య,మనవిశ్రీ కాంస్య పతకాలు సాధించారు.*అలాగే కుమిటే విభాగం లో శ్రీశాంత్ గౌడ్, రుద్ర, ప్రభవ్, కారుణ్య, విష్ణు, శ్రీనిష్, అనన్య బంగారు పతకాలు సాధించారు. అలాగే మనస్వాని వెండి పతకాలు మరియు ఉదయశ్రీ, మనవిశ్రీ, శతన్వి కాంస్య పతకాలు సాధించారు.ఈ కరాటే పోటీలలో ముఖ్య అతిథిగా వచ్చిన విశాఖపట్నం అసిస్టెంట్ కమిషనర్ y. శ్రీనివాసరావు, ( సౌత్ సబ్ డివిజన్) గాజువాక ఎమ్మెల్యే TDP స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు, మరియు బిజెపి అధ్యక్షులు కర్ణ నర్సింహారావు కరాటే ఆర్గనైజషన్ సెక్రటరీ నరేంద్ర హాజరయ్యారు. అలాగే కరాటే మాస్టర్ రవికుమార్ గౌడ్ ను శాలువాతో సన్మానించి మెమొంటో మరియు ట్రోపి అందజేశారు. అలాగే గెలిచిన విద్యార్థులకు పతకాలు,మరియు సర్టిఫికెట్లు అందజేశారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.