అర్చకుల సమస్యలను పరిష్కరించేలా కృషిటీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

Facebook
X
LinkedIn

సంగారెడ్డి :

అర్చకుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి, పరిష్కరించేలా చూస్తానని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.ధూప దీప నైవేద్య అర్చక సంఘం.. తెలంగాణ రాష్ట్రం మరియు ఉమ్మడి మెదక్ జిల్లా (సంగారెడ్డి సిద్దిపేట మెదక్) ఆధ్వర్యంలో.. రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో.. దూపదీప నైవేద్య అర్చక సమస్యలపై అర్చక చైతన్య యాత్ర చేయడం జరిగింది.. ఇందులో భాగంగా సంగారెడ్డి అధ్యక్షులు మడుపతి అడ్వయ్య స్వామి, మెదక్ జిల్లా అధ్యక్షులు శలాక రాజేశ్వర్ శర్మ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు చాడనంద బాల శర్మ మరియు కార్యదర్శులు, శ్యామ్ సుందర్ శర్మ, వీరభద్రయ్య స్వామి, చిదిరే రాజశేఖర్ శర్మ కోశాధికారులు. ఎం శంభు ప్రసాద్ స్వామి, ప్రవీణ్ శర్మ, రాజ మనోహర్ శర్మ. మహేష్ స్వామి మరియు రాష్ట్ర బాధ్యులు , నియోజకవర్గ కన్వీనర్లు మండల కన్వీనర్లు మూడు జిల్లాల అర్చకులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీఐఐసీ చైర్ పర్సన్ శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు.. వారికి అర్చక సంఘం తరఫున అర్చక సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. ఇందులో ఉద్యోగ భద్రత, కనీస వేతనం, ప్రభుత్వ పథకాలలో చోటు, ఇందిరమ్మ ఇల్లు తదితర విషయాలు అడగడం జరిగింది, మరియు అర్చకులు ర్యాలీగా వెళ్లి దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ గారికి అర్చక సంస్థలపై వినతిపత్రం సమర్పించినారు.. టీజేఏసీ చైర్మన్ మాట్లాడుతూ అర్చక సమస్యలు కచ్చితంగా తీరుస్తామని సీఎం దృష్టికి తీసుకుపోతామని తెలిపారు.