ఇంటర్నెట్ డెస్క్: సినీ నటి సమంత తాజాగా పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తన రాశికి 2025 ఎలా ఉంటుందో చెబుతూ వచ్చిన ఒక సందేశాన్ని ఆమె (Samantha) ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. అందులో చెప్పిన విధంగా జరగాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ‘వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది’ అని ఆ పోస్ట్లో ఉంది.
- ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు.
- వృత్తి పరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు.
- ఆర్థికంగా బలంగా ఉంటారు
- నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు
- ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు
- ఆదాయ మార్గాలు పెంచుకుంటారు
- మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంటారు
- మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటారు
- పిల్లలను పొందుతారు అని ఆ జాబితాలో రాసి ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఇందులో రాసి ఉన్న విధంగా మీకు అంతా మంచే జరగాలని అభిమానులు కామెంట్ పెడుతున్నారు.
‘మనోజ్.. నువ్వు నా గుండెల మీద తన్నావ్ రా’ : మోహన్బాబు
ఇక సినిమాల విషయానికొస్తే.. ‘సిటడెల్’తో ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఇప్పుడు తన రాబోయే సిరీస్ కోసం ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్’. ది బ్లడీ కింగ్డమ్ అనేది ఉపశీర్షిక. ‘తుంబాడ్’ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకుడు. తాజాగా ఈ సిరీస్ సెట్లోకి అడుగుపెట్టినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫొటోను పంచుకున్నారు. ‘మళ్లీ యాక్షన్ మోడ్లోకి వచ్చేశా’ అని వ్యాఖ్యల్ని జోడించారు.