హైదరాబాద్ :
చదువుకునే హక్కు కోసం రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచి వెళ్లడాన్ని మీరు ఊహించగలరా? అదీ బాలికలు.
ఊహించుకుంటేనే ఒళ్ళు గగ్గుర్పొడుస్తుంది. కానీ సరిగ్గా అదే జరిగింది. 90 మందికి పైగా అరుణాచల్ ప్రదేశ్లోని ఒక పాఠశాల విద్యార్థినులు చలి, చీకటిలో కవాతు చేస్తూ సరిగ్గా అలాగే చేశారు. కారణం కీలకమైన ఉపాధ్యాయ పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉన్నాయి! వారందరూ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయకు చెందిన పదకొండు పన్నెండు తగతులకు చెందిన విద్యార్థినులు. ఈ విద్యార్థినుల్లో చాలామంది నిజానికి వారి గ్రామాల్లో సీనియర్ తరగతులకు హాజరయ్యే మొదటి అమ్మాయిలు. ఈ విద్యార్థినులు అరుణాచల్ ప్రదేశ్ లోని న్యాంగ్నో గ్రామం నుండి జిల్లా లెమ్మి వరకు ఉన్న రోడ్లపై మార్చ్ చేసారు. వారి అడుగుల ప్రతిధ్వనులు సమానత్వం మరియు న్యాయంపై నమ్మకం ఉన్న వారందరి హృదయాలలో ప్రతిధ్వనించాయి. వారు కీర్తి, సౌకర్యం లేదా విలాసం కోసం నడవలేదు – వారు మరింత శక్తివంతమైన దాని కోసం నడుస్తున్నారు: అదే వారి విద్య హక్కుకోసం.

ఈ యువ యోధులు తాము అడుగులు వేస్తున్న ప్రతి మైలుకి ఒక సందేశాన్ని అందించారు – ఏ బిడ్డకూ వారు పుట్టిన ప్రదేశం కారణంగా లేదా కులం, మతం కారణంగా వారికీ చదివే హక్కును, అవకాశాలను నిరాకరించకూడదన్నదే ఆ సందేశం. వారి పాదయాత్ర సమానత్వం, గౌరవం మరియు ప్రతి అమ్మాయి కలలు కనే ప్రకాశవంతమైన రేపటి కోసం పిలుపునిచ్చింది.
అసలు విషయం ఏమిటంటే అరుణాచల్ ప్రదేశ్లోని జిల్లా లెమ్మీలోని న్యాంగ్నో గ్రామం నుండి పదకొండు పన్నెండు తరగతులకు చెందిన 90 బాలికలు తమ స్కూల్లో ఉపాద్యాయులు లేరని వారి కొరత కారణంగా పాఠ్యాంశాలు (సిలబస్) పూర్తి కావడంలేదని, ఉపాధ్యాయులను నియమించమని కోరుతూ న్యాంగ్నో గ్రామంనుండి 14.09.2025 రాత్రి పాదయాత్ర చేస్తూ బయలు దేరి 65 కిలోమీటర్లు నడిచి 15.09 2025 నాటి ఉదయం జిల్లా విద్యాధికారి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అంతకు ముందు చాలా సార్లు ప్రధానోపాధ్యాయురాలికి విన్నవించామని, జిల్లా విద్యాధికారులకు చాలా ఉత్తరాలు రాశామని అయినా ఎవరూ స్పందించాకపోవటంతో మరోమార్గం కానరాక ఇలా పాదయాత్ర చేయాల్సివచ్చింది బాలికలు చెప్పారు. ఖంగుతిన్న అధికారులు వారికీ మీరు మీగ్రామం వెళ్ళేటప్పటికి ఉపాధ్యాయుల పోస్టింగు జరుగుతుందని హామీ ఇచ్చిన తరువాతే వారు అక్కడి తిరిగి తమ గ్రామానికి బయలు దేరారు.
కానీ వారి ఈ సాహసోపేత పాదయాత్ర ఫై, ప్రధాన స్రవంతి మీడియా కళ్ళు మూసుకుంది. బ్రేకింగ్ న్యూస్ లేదు, ప్రైమ్-టైమ్ చర్చలు లేవు, మొదటి పేజీ కవరేజ్ లేదు. కెమెరాల నిశ్శబ్దం వారి ధైర్యాన్ని అణచివేయలేదు. మార్పు ఎల్లప్పుడూ పార్లమెంటులో లేదా కోర్టులలో ప్రారంభం కాదని ఈ అమ్మాయిలు నిరూపించారు – కొన్నిసార్లు, అది అలసిపోయిన పాదాలు, దృఢనిశ్చయం కలిగిన హృదయాలు మరియు తమహక్కుని వదులుకోవడానికి నిరాకరించడంతో ప్రారంభమవుతుంది.

వారి ఈ రాత్రిపూట పాదయాత్ర కేవలం ఉపాధ్యాయుల డిమాండ్ మాత్రమే కాదు – న్యాయం కోసం, గుర్తింపు కోసం, విద్య ఒకహక్కు, ప్రత్యేక హక్కుకాదు అనే భవిష్యత్తు కోసం డిమాండ్. వారి పాదయాత్ర కేవలం ప్రశంసలకు అర్హమైనది కాదు, చర్యకు అర్హమైనది. ఈ 90 మంది బాలికలు ముఖ్యాంశాలలోకి వచ్చి ఉండకపోవచ్చు, కానీ వారు తరాలకు స్ఫూర్తినిచ్చే అధ్యాయాన్ని లిఖించారు.
సమాచారం
పి జయ ప్రకాష్
9502104574









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.