న్యూఢిల్లీ :
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ 15వ భారత ఉపరాష్ట్రపతిగా సెప్టెంబర్ 12న బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ మేరకు రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామ చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ . ప్రతిపక్ష ఇండి కూటమి అభ్యర్థిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పోటీకి దిగారు. 9న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ 148 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ మరికొన్ని గంటల్లో రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది.