కేరళలో కలకలం రేపుతోన్న జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ వ్యాధి

Facebook
X
LinkedIn

   గడిచిన వారం రోజులలో ఈ వ్యాధి బారినపడి 12 మంది మృతి

కోయంబత్తూర్ :

కేరళ లో జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌   వ్యాధి కలకలం రేపుతోంది. గడిచిన వారం రోజులలో ఈ వ్యాధి బారినపడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ ఏడాది ఇప్పటివరకు జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ బారినపడి మరణించిన వారి సంఖ్య 26కు పెరిగింది. కేరళ ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.కేరళలోని మొత్తం 35 జిల్లాలకుగాను 33 జిల్లాలో జపనీస్ ఎన్‌సెఫలైటిస్‌ ప్రభావం చూపుతోంది. కేవలం దిమా హసావో, హెయిలకండి జిల్లాల్లో మాత్రమే ఆ వ్యాధి ప్రభావం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళ ప్రభుత్వం అన్ని జిల్లాల ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. దేశంలోని మొత్తం జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ కేసులలో ఒక్క కేరళలోనే 50 శాతం ఉన్నాయని తెలిపింది.ప్రస్తుతం రాష్ట్రంలో 300 జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ కేసులు ఉన్నాయని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ వ్యాధి 10 లోపు పిల్లలపై, 60 ఏళ్ల పైబడిన వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.