కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30‌ నుంచి 34 శాతం జీతాలు పెంపు

Facebook
X
LinkedIn

న్యూఢిల్లీ ;

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా ఉద్యోగుల జీతాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఒక చర్చ సాగుతోంది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30‌ నుంచి 34 శాతం జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని వేతన సంఘం ఈ మేరకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెంచిన జీతాలు 2026 జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.ఈ 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం వేతనాలు పెంచినట్లయితే.. దాదాపు 11 మిలియన్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని కేంద్రం నియమిస్తున్న సంగతి తెలిసిందే. 2016లో మోదీ సర్కార్ 7వ వేతన సంఘాన్ని నియమించింది. అప్పుడు అత్యల్పంగా 14 శాతం మేర జీతాలను పెంచారు. మళ్లీ ఈ ఏడాది 8వ వేతన సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ సంఘం సిఫారసు మేరకు ఉద్యోగుల వేతనాలను పెంచనున్నారు.