దోపిడీకి ఫెయిల్… రైల్వే పోలీసుల గన్షాట్లు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో తుమ్మలచెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్లో అర్ధరాత్రి హడావిడి.
రైలులోకి ప్రవేశించిన దోపిడీ ముఠా… గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తం.
గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు… తుపాకీ శబ్దాలతో దుండగులు పరార్.
వస్తువులు వదిలేసి చీకట్లోకి పరార్!
ఇంతకీ ఏం జరిగిందంటే…
విశాఖ ఎక్స్ప్రెస్ రైలు తుమ్మలచెరువు వద్దకు చేరేసరికి ఓ ముఠా దోపిడీకి ప్రణాళిక వేసింది.
రైల్వే భద్రతా సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి కాల్పులకు పాల్పడ్డారు.
దీంతో భయపడ్డ దొంగలు అక్కడే వదిలేసిన సామాన్లు తీసుకోలేకపోయారు.
తీవ్ర గాలింపు కొనసాగుతోంది.
పోలీసుల అనుమానం ఏమిటంటే…
ఈ ముఠా అంతర్రాష్ట్రం నుంచే వచ్చిందట.
బీహార్, మహారాష్ట్రలకు చెందిన ముఠాలే రైళ్లలో హల్చల్ చేస్తున్నట్లు సమాచారమట.
వారంలో మూడోసారి ఇదే ముఠా దాడి యత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈసారి కఠినంగా తిప్పికొట్టామని రైల్వే అధికారులు స్పష్టం.