ముంబై :
ముంబై ప్రజల జీవనంలో భాగమైన లోకల్ రైళ్లు.. వారి ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నాయి. మహానగరంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల రైలు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఇలా గత పదకొండేండ్ల కాలంలో ఏకంగా 29 వేల మందికిపైగా రైలు ప్రమాదాల్లో మరణించారు.దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రజా రవాణా వ్యవస్థలో సబర్బన్ రైల్వే వ్యవస్థ అత్యంత ప్రధానమైనవి. ఉరుకులుపరుగుల జీవనం గడిపే కోట్లాది మంది రవాణా కష్టాలను లోకల్ రైళ్లు తీరుస్తాయి. నిత్యం రద్దీగా ఉంటే ఈ రైళ్లు.. ఉదయం, సాయంత్రం వేళల్లో జనంతో కిక్కిరిసిపోతాయి. కనిసం నిలబడటానికి కూడా జాగా లేక ప్రజలు వేలాడబుతూ ప్రయాణాలు చేయడం సర్వసాదారణం. అయితే ముంబై ప్రజల జీవనంలో భాగమైన లోకల్ రైళ్లు.. వారి ప్రాణాలను కూడా బలితీసుకుంటున్నాయి. మహానగరంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల రైలు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఇలా గత పదకొండేండ్ల కాలంలో ఏకంగా 29 వేల మందికిపైగా రైలు ప్రమాదాల్లో మరణించారు. వారిలో 8,416 మంది బాధితులను ఇప్పటికీ గుర్తించకపోవడం గమనార్హం. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.