AI-171 స్థానంలో AI-159 నెంబర్ విమానం
న్యూ డిల్లీ :
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. AI-171 నంబర్ను నిలిపివేయాలని నిర్ణయించింది. విమాన ప్రమాద మృతులకు గౌరవార్ధంగా ఈ నెంబర్ ను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా శనివారం ప్రకటించింది. AI-171 స్థానంలో AI-159 నెంబర్ విమానం అహ్మదాబాద్-లండన్ మధ్య సేవలందించనుందని తెలిపింది.కాగా, గురువారం అహ్మదాబాద్లో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 270కి పెరిగిందని వైద్యులు తెలిపారు. లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న విమానం AI 171 గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన నిమిషాలకే BJ మెడికల్ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టిన సంగతి తెలిసిందే.