న్యూ డిల్లీ :
ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ బ్రిటిష్ జాతీయుడు రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ) పరామర్శించారుPM Modi | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిరిండియా బోయింగ్ ఏ-171లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది మరణించారు. అయితే, ఒకే ఒక్కరు రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు రమేశ్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు.
