అహ్మదాబాద్ :
గుజరాత్లో పెను విషాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్లో విమానం కుప్పకూలిపోయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 విమానం మేఘానిలో కుప్పకూలిపోయింది.టేకాఫ్ అయిన నిమిషాల్లోనే సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, విమానం కూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఫ్లైట్ భూమిని తాకగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం పెద్ద ఎత్తున పొగ ఎగసిపడింది. సమాచారం అందుకున్న అధికారులు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంటోంది.