న్యూఢిల్లీ :
యూట్యూబర్, జర్నలిస్టు అజయ్ శుక్లాపై సుమోటో కేసు నమోదుకు సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాదిపై ఇటీవల శుక్లా తన యూట్యూబ్ ఛానల్లో వివాదాస్పద వీడియోను పోస్టు చేశారు. సీనియర్ జడ్జిని కించపరిచే విధంగా ఉన్న ఆ వీడియోను డిలీట్ చేయాలని సుప్రీం ఆదేశించింది. సీజే బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాషి, ఏఎస్ చందూర్కర్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇలాంటి కాంటెంట్ను మళ్లీ యూట్యూబ్లో అప్లోడ్ చేయరాదు అని కోర్టు ఆదేశించింది.వరప్రద మీడియాకు ఎడిటర్ అయిన శుక్లాకు నోటీసులు కూడా ఇచ్చింది. సీనియర్ జడ్జిపై యూట్యూబర్ శుక్లా చేసిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. శుక్లాపై సుమోటో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. యూట్యూబ్లో చేసిన ఆరోపణలతో న్యాయ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని, రాజ్యాంగం భావ స్వేచ్ఛను కల్పిస్తున్నదని, కానీ దానికి నిబంధనలు ఉన్నాయని, అత్యున్నత న్యాయస్థానానికి చెందిన జడ్జీని కించపరిచే రీతిలో ఆరోపణలు చేయడం సరైంది కాదు అని, ఇది ధిక్కరణ అవుతుందని, న్యాయ వ్యవస్థకు చెడు పేరు వస్తుందని సీజేఐ తెలిపారు.