భార‌త్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు సిద్ధం..

Facebook
X
LinkedIn

శాంతి చ‌ర్చ‌ల కోసం క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ష‌రుతుగా పెట్టిన పాక్  ప్ర‌ధాని

ఇస్లామాబాద్‌  :

పాకిస్థాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ భార‌త్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. శాంతి స్థాప‌న కోసం భార‌త్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న క‌మ్రా ఎయిర్ బేస్‌ను విజిట్ చేసిన త‌ర్వాత ఆయ‌న మాట్లాడారు. అక్క‌డ ఉన్న సైనికులు, మిలిట‌రీ ఆఫీస‌ర్ల‌ను ఆయ‌న క‌లిశారు. శాంతి స్థాప‌న కోసం పాకిస్థాన్ సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే శాంతి చ‌ర్చ‌ల కోసం క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ష‌రుతుగా పెట్టారాయ‌న‌.కానీ భార‌త్ మాత్రం పాకిస్థాన్ ష‌ర‌తును తిర‌స్క‌రిస్తూనే ఉన్న‌ది. జ‌మ్మూక‌శ్మీర్‌, ల‌డాఖ్‌లు త‌మ భూభాగాల‌ని చెబుతూనే ఉన్న‌ది. పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో.. ఆయ‌న‌తో పాటు డిప్యూటీ ప్ర‌ధాని ఇషాక్ దార్‌, ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ అసిమ్ మునీర్, ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ జ‌హీర్ అహ్మ‌ద్ బాబిర్ సిద్దు ఉన్నారు.ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య మే 10వ తేదీన కాల్పుల విమ‌ర‌ణ ఒప్పందం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. మే 6వ తేదీ రాత్రి ఇండియా ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్టింది. పెహల్గామ్ ఉగ్ర‌దాడిలో 26 మంది చ‌నిపోయిన ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారంగా ఆప‌రేష‌న్ సిందూర్ నిర్వ‌హించారు. క‌మ్రా బేస్ క‌న్నా ముందు సియాల్‌కోట్‌లో ఉన్న ప‌స్రూర్ కంటోన్మెంట్‌ను కూడా పాక్ ప్ర‌ధాని విజిట్ చేశారు.