ఘనం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు

Facebook
X
LinkedIn

టీడీపీ కేంద్ర కార్యాలయంలో

తెలుగునాడు, అమరావతి :

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేట్ కట్ చేసి పల్లా శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 95,235 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి, రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన శాసనసభ్యునిగా పల్లా శ్రీనివాసరావు గుర్తింపు పొందారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చేసి “పీపుల్స్ లీడర్”గా నిలిచారు. రాష్ట్ర అధ్యక్షునిగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజా సేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతంగా ఉండాలని టీడీపీ కుటుంబం సభ్యలు ఆకాంక్షిస్తున్నారు.

ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మరింత బలపడి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య, బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నిలాయపాలెం విజయకుమార్, గోనుగుంట్ల కోటేశ్వరరావు రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్, కల్లం సాంబిరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఏవిరమణ, రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కోడూరు అఖిల్, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు దారు నాయక్, టీడీపీ అధికారప్రతినిధి పాతర్ల రమేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.