- ‘ఫ్రాంటియర్ రాస్’ క్రియేటివ్ డైరెక్టర్ గౌరాంగ్ బాత్రా
తెలుగునాడు, హైదరాబాద్ :
భారతీయ వస్త్ర వైభవాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని ‘ఫ్రాంటియర్ రాస్’ క్రియేటివ్ డైరెక్టర్ గౌరాంగ్ బాత్రా తెలిపారు. భారతదేశం సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసే ఉద్దేశంతో లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఫ్రాంటియర్ రాస్ ‘శృంగర్ శృంఖలా’ పేరుతో హైదరాబాద్ స్టోర్లో ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా బాత్రా మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిలో చీర ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ వేడుక ఉద్దేశం అన్నారు. ఈ ఐకానిక్ వస్త్రానికి గౌరవం తీసుకురావడంలో ఈ ఈవెంట్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. భారతీయ వస్త్రాల అందం, నైపుణ్యాన్ని మా బ్రాండ్ ద్వారా ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా గౌరవ అతిథి పింకీ రెడ్డి మాట్లాడుతూ ‘అలంకారం’ అనే భావన మన సంస్కృతిలో ఒక భాగమన్నారు. చీర అలంకారానికి అత్యుత్తమ ప్రతీక అన్నారు. ఇది మన వారసత్వ సంపదని తెలిపారు. మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతినిధిగా నిలుస్తుందని చెప్పారు. ఈ వేడుకలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా రిద్ధిమా కపూర్ సాహ్ని మాట్లాడుతూ చీర భారతదేశం తాలుకా విభిన్న వస్త్ర వారసత్వాన్ని ప్రదర్శించే కాన్వాస్ అన్నారు. ప్రతి ప్రాంతం, ప్రతి సంఘం, ప్రతి చీర హస్తకళ, అందం యొక్క ప్రత్యేక కథను చెబుతుందని చెప్పారు. చీర సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలియజేసే ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు.
భారతీయ సంస్కృతిలో అలంకరణకు ఉన్న ప్రాముఖ్యతను.. ముఖ్యంగా చీర తాలుకా విశేషాలను పంచుకునేందుకు ఉద్దేశించిన ఒక ఆలోచనాత్మక చర్చ ఇది. ఈ కార్యక్రమానికి అక్షత్ కపూర్ మోడరేటర్గా వ్యవహరించారు. ఈ ఈవెంట్ను ఆర్చీ పరాంజీ, బాబీ కంధారి సహా సమర్పకులుగా వ్యవహరించారు. ఈ వేడుకకు హైదరాబాద్ నగరంలోని ప్రముఖ సామాజిక, సాంస్కృతిక, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరయ్యారు. పద్మజా రెడ్డి, ఎలాహే హిప్తూల్లా, శుభ్రా మహేశ్వరి, దివ్యా రెడ్డి సల్లా, అనామ్ మీర్జా తదితరులు పాల్గొన్నారు.
అలరించిన హిందుస్తానీ సంగీతం
గాయకురాలు విద్యా షా ఆత్మీయ ప్రదర్శన ఆహుతులను అలరించింది. హిందుస్తానీ సంగీతంలోని మనోహరమైన ప్రదర్శనల ద్వారా తొమ్మిది రసాలలో ఒకటైన శృంగార్ రసాన్ని సజీవంగా తీసుకువచ్చింది. ఆమె క్లాసిక్ థుమ్రీ, ‘రాస్ కే భరే తోరే నైన్’ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ప్రదర్శన సంగీతం, కవిత్వం, భావోద్వేగాల సంపూర్ణ సమ్మేళనంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఫ్రాంటియర్ రాస్ గురించి
ఫ్రాంటియర్ రాస్ కళాత్మకత, నాణ్యత, స్థిరత్వం, ప్రీమియం కస్టమర్ అనుభవం కలయికగా నిలుస్తుంది. 70 సంవత్సరాల విజయవంతమైన వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ బ్రాండ్ బన్సీలాల్ బాత్రా నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో హస్తకళ ద్వారా భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే దృష్టితో 1954లో స్థాపించారు. భారతీయ సంప్రదాయ సంపదను అద్భుతమైన కళాకృతుల ద్వారా ప్రదర్శించడమే లక్ష్యం. ఫ్రాంటియర్ రాస్ అంకితభావం, నూతన ఆవిష్కరణలు.. ఈ బ్రాండ్ భారత్లోనే కాక గ్లోబల్గా ఎదగడానికి ప్రేరేపించింది.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.