తెలుగు నాడు, ఉప్పల్ :
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉప్పల్ శ్రీరామ కాలనీ లోని శ్రీ సీత రామచంద్ర స్స్వామి ఆలయంలో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో దేవాలయ నిర్వాహకులు మోత్కూరి రాఘవదాస్ శర్మ, మోత్కూరి కృష్ణ శర్మ , మోత్కూరి ప్రసాద్ , మోత్కూరి హరీష్ విజయేంద్ర, మోత్కూరి అక్షయ్ శర్మ , నెల్లూరి మల్లికార్జున్ శర్మ , బల్వంత్ రెడ్డి , మెనంపల్లి మురళి గౌడ్ ,రాఘవేందర్ పాల్గొన్నారు.