చర్లపల్లి డివిజన్ అభివృద్ధికి మరో ముందడుగు

Facebook
X
LinkedIn

రూ.40 లక్షలతో సీసీ రోడ్ల మంజూరు

చర్లపల్లి :

కార్పొరేటర్ రూ.2 కోట్ల ప్రత్యేక అభివృద్ధి బడ్జెట్ కింద చర్లపల్లి డివిజన్‌లోని శ్రీ ఆంజనేయ కాలనీ మరియు ఆఫీసర్స్ కాలనీలలో సీసీ రోడ్ల అభివృద్ధి పనుల కోసం రూ.40 లక్షలు బొంతు శ్రీదేవి యాదవ్ మంజూరు చేయించారు.

ఈ నిధులతో కాలనీలలో రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.

ఈ సందర్భంగా కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న బొంతు శ్రీదేవి యాదవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.