ఉమెన్ సివిల్ రైట్స్ అనే పేరుతో  మహిళల లైంగిక దోపిడి.. మహిళల అక్రమ రవాణ

Facebook
X
LinkedIn

పౌర హక్కుల ప్రజా సంఘం(పీయూసీఎల్) ఆధ్యక్షురాలు జయవింధ్యాల

హైదరాబాద్ :

హైదరాబాద్ ఉమెన్ సివిల్ రైట్స్ అనే స్వచ్ఛంద సంస్థ ను నడిపిస్తూ మహిళల లైంగిక, దోపిడి. మహిళల అక్రమ రవాణ లాంటి అనైతిక కార్యాక్రమాలు పాల్పడుతూన్న పాతబస్తి బాబానగర్కు చెందిన నిలోఫరోగంతో తమకు ప్రాణాహాని ఉందని భాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం హైదరూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌర హక్కుల ప్రజా సంఘం(పీయూసీఎల్) ఆధ్యక్షురాలు జయవింధ్యాల భాధితులు మహ్మద్ అమీర్ షరీఫ్, అబ్దులు వాసీమ్, ఆష్రప్ ఉన్నీసా, మహ్మద్ ఇబ్రహీంలతో కలిసి ఆమె మాట్లాడారు. ఉమెన్ సివిల్ రైట్స్ పేరిట సంఘం నడుపుతూ యువతులకు ఆశ చూపిస్తూ అరబ్ దేశాలతో పాటు ముంబాయ్, పూణే నగరాలకు తరలించి వ్యభాచార రాకేట్ నిర్వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం సదరు సంస్థ బండ్లగూడ తదితర ప్రాంతాలలో మహిళ సేవా పేరిట ఆమాయక మహిళలను మోసం చేస్తూ రహాస్యంగ చట్టవిరుద్ధ కార్యకాలపాలకు పాల్పడుతుందని తెలిపారు. అయితే ఈ విషయంపై పోలీసులతకు సమాచారం ఉన్న వారు చూసిచుడనట్లు వ్యవహారిస్తు నిలోఫర్ బేగంకు వత్తాస్తు పలుకుతున్నారని తెలిపారు. ఆమె రహస్యలు తెలిసిన భాదితులను హాత్య చేసేందుకు ఆమె కుమారులు, అనుచారులతో కుట్ర పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమను హత్య చేసేందుకు రెక్కి చేస్తూ భాదితులను భయభ్రాంతులకు గురుచేస్తున్నరని తెలిపారు. ఈ విషయంపై స్థానిక కంచన్బాగ్ పోలీసులకు, ఇతర పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే పాపన పోవడంలేదని వాపోయ్యారు. మహిళ సేవ ముసుగులో పాతబస్తీలో విస్తరిస్తున్న ఉమెన్ ట్రాఫికింగ్పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అలగే ఉమెన్ ట్రాస్క్ఫోర్సు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నాలుగురు బాధితులకు ప్రాణాహాని ఉందని వారికి రక్షణ కల్పించాలని కోరారు. స్థానిక పోలీసు వ్యవస్థ దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు ఇక్బాలాఖాన్, హైమాద్, బాలకిషన్రావు, మహ్మద్ కాజా తదితరులు పాల్గొన్నారు.