జనగామలో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కి స్టాప్‌

Facebook
X
LinkedIn

జనగామ :

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా కేంద్రంలో శాతవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు స్టాప్‌ కల్పించింది.

విజయవాడ–సికింద్రాబాద్–విజయవాడ మధ్య నిత్యం నడిచే ఈ రైలు ఇకపై జనగామ రైల్వే స్టేషన్‌లో ఆగనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అక్టోబర్‌ 30వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ఈ స్టాప్‌ అమల్లోకి రానుంది.
విజయవాడ–సికింద్రాబాద్‌ రైలు ఉదయం 10:14–10:15 గంటల మధ్య, సికింద్రాబాద్–విజయవాడ రైలు సాయంత్రం 5:19–5:20 గంటల మధ్య ఒక్క నిమిషం పాటు జనగామ రైల్వే స్టేషన్‌లో ఆగుతుందని సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ తెలిపారు.