భారతీయ సినీ గర్వంగా అభినందించిన పవన్ కల్యాణ్
హైదరాబాద్ :
ప్రఖ్యాత నటుడు, దర్శకుడు కమల్ హాసన్కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ అవార్డులను అందించే అకాడమీ 2025 సంవత్సరానికి ఏర్పాటుచేసిన కమిటీలో ఆయన సభ్యునిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
“విశ్వనటుడు కమల్ హాసన్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఆయన చూపిన ప్రతిభ అసాధారణం. కథకుడిగా, దర్శకుడిగా, నటుడిగా ఆయన ప్రతిభ భారతీయ సినిమా పట్ల ఉన్న ప్రేమకు అద్దం పడుతుంది. కమల్ గారి ఈ గౌరవం భారత సినీ రంగానికి గర్వకారణం” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కమల్ హాసన్ ప్రతి విభాగంలోనూ తన ముద్ర వేసిన వ్యక్తిగా కొనియాడిన పవన్, “ఆయన రచన, దర్శకత్వం, నటనలో మాత్రమే కాదు – ప్రతి చిన్న అంశంలోనూ పరిశీలనతో వ్యవహరించే సృజనాత్మకత కలిగినవారు. ఈ కొత్త బాధ్యత ద్వారా ప్రపంచ సినిమాకు ఆయన మరింత సేవలందిస్తారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.
ఇక కమల్ హాసన్ ఎంపికపై సినీ ప్రముఖులు, అభిమానులూ ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.