మైక్రోసాఫ్ట్‌లో మరో రౌండ్‌ లేఆఫ్స్‌.. వేలాది మందిపై ప్రభావం..!

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌   ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో రౌండ్‌ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్‌లో మరో రౌండ్‌ లేఆఫ్స్‌.. వేలాది మందిపై ప్రభావం..! పడీ అవకాశం లేకపోలేదు.ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వల్ల టెక్‌ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు   కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ లాంటి దిగ్గజ కంపెనీలు వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 130 కంపెనీలు కలిసి 61 వేల మంది ఉద్యోగులను తొలగించాయి.ఇక ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌   ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో రౌండ్‌ లేఆఫ్స్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో మైక్రోసాఫ్ట్‌ మరోసారి ఉద్యోగుల కోతకు సిద్ధమైనట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా వేలాది మందిపై వేటు వేయనున్నట్లు తెలిపింది. తాజా రౌండ్‌ సేల్స్‌ విభాగంలో ఉండనున్నట్లు సంస్థ అధికారులను ఊటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. అయితే, ఈ లేఆఫ్స్‌పై మైక్రోసాఫ్ట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.కాగా, మైక్రోసాప్ట్‌ ఈ ఏడాది మే నెల మధ్యలో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తమ సిబ్బందిలో మూడు శాతం మందికి లేఆఫ్‌లు ఇచ్చింది. అంటే దాదాపు 6వేల మందిని తొలగించింది. 2023లో 10 వేలమందికి ఉద్వాసన పలికిన అనంతరం ఇదే రెండో అతిపెద్ద తొలగింపు. మేనేజ్‌మెంట్‌ స్థాయిలను తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యమని సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక ఈ ఏడాది జనవరిలో కూడా పనితీరు ఆధారంగా కొంతమందిని సంస్థ తొలగించిన విషయం తెలిసిందే. ఈనెల ఆరంభంలో కూడా పలువురిపై సంస్థ వేటు వేసింది. డైనమిక్‌ మార్కెట్‌లో పోటీదారుగా నిలవడానికి, కంపెనీ పునర్‌ నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవడానికి కోతలు తప్పడం లేదని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. ‘మార్కెట్‌లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూన్నాం’ అని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.