ఈనెల 17 జరిగే ధర్నా కార్యక్రమం విజయవంతం చేయండి
సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం
తెలుగునాడు, కాప్రా :
కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి నుండి మావోయిస్టుల ఏరివేత దిశగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీ నాయకులు కార్యకర్తల మీద హత్యకాండము కొనసాగిస్తుంది దీనిని వెంటనే ఆపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం డిమాండ్ చేశారు.
శాంతి చర్చల కమిటీ ఈనెల 17వ తేదీన ఇందిరాపార్క్ దగ్గర నిర్వహించే మహాధర్నా విజయవంతం చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ తెలియజేస్తూ వాల్పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. గత 17 నెలల నుండి దాదాపుగా 540 మంది మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతో హతమార్చడం జరిగింది ఆపరేషన్ కగార్ పేరుతో హతమార్చడం జరిగింది ఇందులో మూడో వంతు అమాయకులైన ఆదివాసులే ఉన్నారు అభివృద్ధి పేరుతో రాజ్యాంగ హక్కులను చట్టాలను ఉల్లంఘించి అక్కడ ఉన్న ప్రకృతి వనరులను కనీసంపదను స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు దారతత్వం చేయుటకు లక్ష్యంగానే ఈ హత్య అక్కడ ఉన్న ప్రకృతి వనరులను కనీసంపదను స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు దారతత్వం చేయుటకు లక్ష్యంగానే ఈ హత్యకాండ కొనసాగుతుందని సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జే. చంద్రశేఖర్, కోమటి రవి, జి. శ్రీనివాసులు ఏ. అశోక్ ఐ.రా శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు శశంకర్,లింగస్వామి నాయకులు పి. గణేష్ ఏం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.