ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నూతన గృహ ప్రవేశం నకు హాజరైన అశేష ప్రజానీకం

Facebook
X
LinkedIn

కుప్పం :

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజక వర్గం శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివ పురం వద్ద నూతనంగా నిర్మించిన సొంతింటి గృహప్రవేశానికి కుప్పం నియోజక వర్గం నలు మూలల నుండి అశేష ప్రజానీకం హాజరై వారి అభిమానాన్ని చాటు కున్నారు. కుప్పం ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి, వీరి తనయుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, శ్రీమతి నారా బ్రాహ్మణితో కలసి అంగరంగ వైభవంగా నూతన సొంతింటి గృహ ప్రవేశాన్ని కార్య క్రమాన్ని నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో వేద పండితులచే హోమం నిర్వహించి శాస్రోత్తంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి దంపతులు, నారా లోకేష్ దంపతులునిర్వహించారు. ఈ నూతన సొంతింటి గృహప్రవేశ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గం ప్రజలను ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన అశేష ప్రజానీకం

ముఖ్యమంత్రి కుటుంబం ఆహ్వానం మేరకు ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి వారింటి గృహప్రవేశంగా భావించి వచ్చి ముఖ్య మంత్రి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.