రాష్ట్రంలో సన్నకారు, చిన్న కారు, రైతుల సమస్యలపై కేంద్ర మంత్రికి వివరించిన ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్
న్యూ డిల్లీ :
తెలంగాణ రాష్ట్రంలో సన్నకారు, చిన్న కారు, రైతులు పడుతున్న ఇక్కట్లను ఎదురవుతున్న , పలు సమస్యలను, కేంద్ర వ్యవసాయ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ని ఢిల్లీలోని కృషి భవన్ లో కలిసి వివరించిన తెలంగాణ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వం దళారీలను ప్రోత్సహించడం వలన వ్యవసాయ పంటలకు, వాణిజ్య పంటలకు, ధాన్యానికి, పసుపుకి, పత్తికి, మిర్చికి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందకుండా పోతోందని వాపోయారు ఫసల్ బీమా యోజన అమల్లో తీసుకువచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఖరీఫ్ రబీ సీజన్లలో ఎరువుల కృత్తిమ కొరతలు సృష్టించడానికి కొంతమంది వ్యాపారులు కల్తీ విత్తనాలు అమ్మకాల వల్ల రైతులకు నష్టం జరుగుతుందని వారికి వివరించారు వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో కూడుకున్న నోడల్ ఆఫీసర్ని ఒకరిని ఏర్పాటు చేయాలని సందర్భంగా వ్యవసాయ శాఖ కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ని కోరారు వ్యవసాయ పనిముట్ల మీద ఉన్న సబ్సిడీలను ఎత్తివేసారని PM KUSUM పియం కుసుం పథకాన్ని అమలు జరపకుండా నీరుగారిస్తున్నారని వారికి తెలియజేశారు , రైతు రుణమాఫీ సరిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల ఇంకా వేలాది రైతులు రుణగ్రస్తులుగానే మిగిలారని కొత్తగా పరపతి వ్యవసాయ రుణాలు ఇవ్వటానికి ఏ బ్యాంకులు కూడా ముందుకు రావటం లేదు అన్న విషయాన్ని తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చి గ్రామీణాభివృద్ధిపై, వ్యవసాయంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని కోరారు.