తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు..టాప్‌-10 ర్యాంకర్లు వీళ్లే

Facebook
X
LinkedIn

హైదరాబాద్‌ :

తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి 10 ర్యాంకులూ బాలురకే వచ్చాయి. మొదటి మూడు ర్యాంకులూ ఏపీకి చెందిన విద్యార్థులకు దక్కాయి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడకు చెందిన పల్లా భరత్‌చంద్రకు మొదటి ర్యాంకు, నంద్యాల జిల్లా కోనాపురం వాసి ఉడగండ్ల రామ్‌చరణ్‌రెడ్డికి రెండో ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన హేమసాయి సూర్యకార్తీక్‌కు మూడో ర్యాంకు వచ్చాయి. హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన మెండె లక్ష్మీభార్గవ్‌కు నాలుగో ర్యాంకు లభించింది. మంత్రిరెడ్డి వెంకట గణేశ్‌ రాయల్‌ (మాదాపూర్‌)కు ఐదో ర్యాంకు, సుంకర సాయి రిశాంత్‌రెడ్డి (మాదాపూర్‌) ఆరో ర్యాంకు, రష్మిత్‌ బండారి (మాదాపూర్‌) ఏడో ర్యాంకు, బనిబ్రత మాజీ (బడంగ్‌పేట్‌)కు ఎనిమిదో ర్యాంకు, కొత్త ధనుష్‌రెడ్డి (హైదరాబాద్‌)కు తొమ్మిదో ర్యాంకు, కొమ్మ కార్తీక్‌ (మేడ్చల్‌)కు పదో ర్యాంకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

అగ్రికల్చర్‌-ఫార్మాలో : అగ్రికల్చర్‌-ఫార్మా ఫలితాల్లో మేడ్చల్‌కు చెందిన సాకేత్‌రెడ్డికి మొదటి ర్యాంకు వచ్చింది. కరీంనగర్‌కు చెందిన సబ్బాని లలిత్‌ వరేణ్య (కరీంనగర్‌)కు రెండో ర్యాంకు, వరంగల్‌కు చెందిన అక్షిత్‌కు మూడో ర్యాంకు లభించాయి. సాయినాథ్‌ (కొత్తకోట, వనపర్తి)కు నాలుగో ర్యాంకు, బ్రాహ్మణి (మాదాపూర్‌)కి ఐదో ర్యాంకు, గుమ్మడిదల తేజస్‌ (కూకట్‌పల్లి)కు ఆరో ర్యాంకు, అఖిరానందన్‌రెడ్డి (నిజాంపేట)కు ఏడో ర్యాంకు, భానుప్రకాశ్‌రెడ్డి (సరూర్‌నగర్‌)కి ఎనిమిదో ర్యాంకు, శామ్యూల్‌ సాత్విక్‌ (హైదర్‌గూడ)కు తొమ్మిదో ర్యాంకు, అద్దుల శశికరణ్‌రెడ్డి (బాలాపూర్‌)కి పదో ర్యాంకు వచ్చాయి.