టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత
అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపు హర్షణీయం
తెలుగునాడు అమరావతి :
• అంగన్వాడీలకు ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది
• జగన్ రెడ్డి పాలనలో అంగన్ వాడీల దుస్థితి దారుణంగా ఉండేది
• నాసిరకం ఆహారం, కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేశారు.. ఎప్పుడు జీతం ఇస్తారో తెలియదు
• జగన్ రెడ్డి పాలనలోలా అంగన్వాడీలు రోడ్డెక్కే పరిస్థితి ఉండదు
• అంగన్వాడీల అభివృద్ధికి చంద్రబాబు ముందుంటారు
అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపుపై టీడీపీ అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు చంద్రన్న మానస పుత్రికలని.. వారి సంక్షేమం, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత దుర్మార్గ ప్రభుత్వంలోలా అంగన్వాడీలు రొడ్డెక్కేల్సిన పరిస్థితి లేదని.. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే మూడు హామీలను అమలు చేశారని.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారని తెలిపారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఆచంట సునీత మాట్లాడుతూ..
గత పాలనలో అంగన్వాడీలు ఏ శాఖ కిందకు వస్తారని ఆ డిపార్ట్ మెంట్ మంత్రి అడిగారంటే అంగన్వాడీల పట్ల ఆ ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రికి ఎంత చిత్త శుద్ధి ఉందో అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మీద తోసి గ్రాట్యుటీ అమలు చేయలేదు. జగన్ పాదయాత్రలో తెలంగాణ కన్నా ఏపీలో జీతాలు ఎక్కువ పెంచుతామని చెప్పి పెంచకుండా మోసం చేశారు. వైసీపీ నేతలు మాటలకే పరిమితం అయితే.. కర్నాటక, గుజరాత్ తరువాత అంగన్వాడీలకు గ్రాట్యుటీని అమలు చేసిన 3వ రాష్ట్రంగా ఏపీ ఉంది. నేడు ప్రభుత్వానికి భారమైనా అంగన్వాడీలకు ఇచ్చి మాట మేరకు గ్రాట్యుటీని కూటమి ప్రభుత్వం పెంచింది. అలాగే అంగన్వాడీలకు అదనపు యాప్ ల భారాన్ని తగ్గించింది.
రూ. 4,200 ఉన్న జీతాన్ని రూ. 10,500 లకు పెంచిన ఘనత చంద్రబాబుదే. రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా.. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుంది.. జగన్ తన పాదయాత్రలో 17 వేల అంగన్వాడీ సెంటర్ లు నిర్మిస్తామని దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చాక ఒక్క సెంటర్ ను కూడా ఏర్పాటు చేయలేదు. 2014 -2019 లో దాదాపు 18,500 సెంటర్లను ఏర్పాటు చేసి.. 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చిన ఘనత టీడీపీది.
అంగన్వాడీలు తమ సమస్యలపై 45 రోజులుగా రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే.. నాడు జగన్ రెడ్డి, ఆ శాఖ మంత్రి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. అంతే కాకుండా గత పాలనలో అంగన్వాడీల్లో నాణ్యతలేని ఫుడ్ ను, మురిపోయిన గుడ్లను పంపిణీ చేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన ఆహారాన్ని గర్భిణీలు, పిల్లలకు అందిస్తున్నారు. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాధికార సర్వే పేరుతో అంగన్వాడీలను గవర్నమెంట్ ఎంప్లాయిస్ గా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను కట్ చేశారు. నేడు గత ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాన్ని రద్దు చేసి.. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి అంగన్వాడీలను అర్హులగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.
జగన్ రెడ్డి పాలనలో ఇచ్చిన ఫోన్లు సరిగ్గా లేక.. అంగన్వాడీలు ఇబ్బంది పడుతుంటే మంచి ఫోన్లు ఇచ్చి ఒక్క యాప్ లోనే అన్ని పనులు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషకరం. గత ప్రభుత్వంలో జీతాలకోసం అంగన్వాడీలు ఇబ్బంది పడ్డారు. నేడు ఒకటోవ తేదీనే అంగన్వాడీలు జీతాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అంగన్వాడీల అభివృద్ధికి ముందుంటారు. అంగన్వాడీలు చంద్రన్నకు అండగా ఉండాలి.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.