తెలుగునాడు, అమరావతి :
సామాజిక న్యాయం, స్త్రీ విద్య, బహుజనుల సాధికారిత కోసం జీవితాంతం పోరాడిన మహాత్మాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్ముడు జ్యోతిరావుఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ “సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై మొట్టమొదటి గళమెత్తిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే. ఆనాడు విద్య కొన్ని వర్గాలకే పరిమితం అయితే… విద్య ద్వారానే సమాజంలో అసమానతలను తొలగించవచ్చు అని చెప్పారు. ఆనాడు పాఠశాలలో కొంతమందికే పరిమితం అయిన విద్యను అందరికీ అందించాలనే లక్ష్యంతో అనేకమందిని చైతన్యపరిచారు. ఈ విధంగా జ్యోతిరావుఫూలే మహిళలలో చైతన్యం తీసుకువచ్చారు. స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో గాంధీ, బీఆర్ అంబేద్కర్, అనేక సంఘసంస్కర్తలు ఫూలే ఆలోచన విధానాన్ని ప్రశంసించారు.
స్వాతంత్రం వచ్చిన తరువాత బలహీనవర్గాలకు తగిన గుర్తింపు లేని సమయంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బలహీనవర్గాలకు సమూచిత స్థానం కల్పించారు. అలాగే స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారి రిజర్వేషన్లు కల్పించారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి.. బడుగు, బలహీన వర్గాలను శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా చేసిన ఘనత నందమూరి తారకరామరావు గారిదే.. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడుగు, బలహీనవర్గాలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. దీనికి తోడు ఆదరణ పథకం వంటి పథకాలను అమల్లోకి తీసుకొచ్చి స్వయం ఉపాధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
గత ఐదేళ్ల జగన్ రెడ్డి ఆరాచక పాలన సాగింది. అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు. ప్రశ్నిస్తే.. దాడులు, కేసులు, హత్యలు అనే ధోరణిలో పాలన సాగించారు. బలహీనవర్గాల నాయకత్వాన్ని అణచివేసే విధంగా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ రక్షణ చట్టానికి శ్రీకారం చుట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో సైతం రూ.47000 కోట్లు కేటాయించడమే కాకుండా స్వయం ఉపాధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్పొరేషన్లు అన్ని బలోపేతం చేసేందుకు నిధులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది’’ అని అన్నారు.

మాజీ ఎమ్మెల్సీ ఆశోక్ బాబు మాట్లాడుతూ ‘‘స్వాతంత్రం రాకముందు, వచ్చిన తరువాత వెనుకబడిన వర్గాలకు, అణగారిన వర్గాలకు, పేద ప్రజలకు చరిత్రలో సమానంగా హక్కుల కోసం జ్యోతిరావు ఫూలే నిస్వార్థంగా కృషి చేశారు. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే లక్ష్యంతో భార్యకు సైతం విద్యను నేర్పించి దేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా నిలిపారు. ఎల్లవేళలా ఒక నాయకుడు సేవ చేయడం వేరు.. కుటుంబంతో కలిసి సేవ చేయడం వేరు.. దేశచరిత్రలో ఫూలే పేరు చిరస్మణీయంగా నిలిచి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆయన స్ఫూర్తితో వెనుకబడిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తుంది. ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది’’ అని అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ‘‘బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే బడుగు, బలహీనవర్గాల సమస్యలను చూసి అనేక సంస్థలను స్థాపించి ఉన్నతికి కృషి చేశారు. అనాడు కొంతమందికే విద్యను అందిస్తున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి విద్య అందించేందుకు కృషి చేసిన మహాత్ముడు జ్యోతిరావు ఫూలే. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్, నాదెండ్ల బ్రహ్మం చౌదరి, పాతర్ల రమేష్, గొట్టిముక్కల రఘురాం రాజు, చప్పిడి రాజశేఖర్, ఆళ్ల గోపాలకృష్ణ, ఏ వి రమణ, దేవతొటి నాగరాజు, పారా రామకృష్ణ పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాలొన్నారు.