విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన,
తీవ్రంగా ఖండించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్
స్వాతంత్ర సమర యోధులు మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజు కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాప్రా మండలం చల్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శాంతినికేతన్ ప్రభుత్వ ఉత్తర్వులను ఖాతర చేయకుండా పాఠశాల నిర్వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. దేశ నాయకులు అంటే గౌరవం లేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు మాకు సంబంధం లేదు అని బేకాతరు చేస్తున్నారు. కాప్రా మండలం చల్లపల్లి లోని రైల్వే స్టేషన్ పక్కన ఉన్న శాంతినికేతన్ స్కూల్ ఈరోజు సెలవు ఇవ్వకుండా పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఇటువంటి విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వారు విద్యార్థులకు ఎటువంటి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు, ఒకసారి అందరూ ఆలోచించాలని పలువురు కోరుతున్నారు. గతంలో కూడా ఈ విద్య సంస్థ ప్రభుత్వ సెలవు దినాల్లో పాఠశాలల నిర్వహించారు. గతంలో అంబేద్కర్ జయంతికి సెలవు ఇవ్వకుండా పాఠశాల నిర్వహించినట్టు పలువురు తెలిపారు. ఇప్పటివరకు ఎన్నడు బాబు జగ్జీవన్ రా జయంతికి సెలవు ఇవ్వలేదు అని అన్నారు. ఈనెల ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినంలో కూడా పాఠశాల నిర్వహించినట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇటువంటి విద్యాసంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలోనే ఈ శాంతినికేతన్ పాఠశాల పై అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. జాతీయ నాయకులు బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా పాఠశాలకు సెలవు ఇవ్వకపోవడం దారుణమని ఖండించారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు పరిశీలించి శాంతినికేతన్ పాఠశాల పై తగిన చర్యలు తీసుకోవాలని సంతోష్ డిమాండ్ చేశారు.