రాష్ట్రంలో కూనారిల్లుతున్న తెలంగాణ పాడి రైతులు – బిజెపి మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జీ ఏనుగు సుదర్శన్ రెడ్డి

Facebook
X
LinkedIn

తెలుగునాడు, ఘట్కేసర్ :

మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం అంకుశాపూర్ లోని విజయ పాల సేకరణ కేంద్రాన్ని సందర్శించి పాడి రైతులు సెంటర్ నిర్వాహకుల ఇబ్బందులను జిల్లా పాడి పరిశ్రమ అధికారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా వైఎస్ఆర్

తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు రైతుల రుణమాఫీ రైతులకు పంట సహాయము ఎగవేసినారు. మరొకవైపు రైతులు మరొక ప్రత్యామ్నాయమైన వ్యవసాయ అనుబంధ ఉపాధి అవకాశాలు పాడి పరిశ్రమ ద్వారా పాల ఉత్పత్తి. ఆ రంగాన్ని కూడా వెన్ను విరుస్తూ సేకరించిన పాలకు ఆరేడు విడతల డబ్బులు చెల్లించకుండా పాడి రైతులను మనోవేదనకు గురి చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి పాల సేకరణకు అదనంగా ₹5 ఇస్తామన్న ప్రభుత్వము నేడు అసలు ₹41 లను కూడా ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే పాల సేకరణ జరుగుతుంది అని తిరోగమన ఆలోచన చేస్తుండడం దుర్మార్గం.

ఎద్దేడిచిన రాజ్యం రైతేడిచిన రాజ్యం బాగుపడదు అన్న విషయం ఈ ప్రభుత్వం రైతుల ఉసురు తగిలి కుప్పకూలడం కాయం. రైతులకు సత్వర బకాయిలు చెల్లించకపోతే పోరాట పంథాను ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని హెచ్చరించారు.