అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారు?

Facebook
X
LinkedIn

 క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్ పై సిపి సజ్జనార్ ఆగ్రహం

హైదరాబాద్ :

బెట్టింగ్ మహమ్మారికి ఎందరో యువకులు బలవుతున్నారని సిపి సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ వల్ల యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్ పై సిపి సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారు? అని బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన సెలబ్రెటీలు బాధ్యులు కారా? అని ప్రశ్నించారు. బెట్టింగ్ వల్ల వేలమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు.