హైదరాబాద్ :
ఆమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్ మరో అమాయకుడిని బలి తీసుకుంది. డల్లాస్లో నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. ఎల్బీ నగర్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్కు చెందిన పోలే చంద్రశేఖర్ 2023లో బిడిఎస్ పూర్తి చేసి.. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. అయితే నేటి తెల్లవారుజామున దుండగుడి కాల్పుల్లో అతను కన్నుమూశాడు. కాల్పులకు పాల్పడింది ఓ నల్ల జాతీయుడని సమాచారం. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించాల్సి ఉంది.