పేదలను దోచుకోవడానికి జిఎస్టి తెచ్చారు

Facebook
X
LinkedIn

జిఎస్టి అంటే గబ్బర్ సింగ్ టాక్స్ :మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ :

పేదలను దోచుకోవడానికి జిఎస్టి తెచ్చారని, జిఎస్టి అంటే గబ్బర్ సింగ్ టాక్స్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం  గాంధీ భవన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 8 సంవత్సరాలుగా బీజేపీ ప్రజలను దోచుకుందని,కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం తాగిందని ఆరోపించారు.జిఎస్టి తో పేదలకు లబ్ది చేసినట్టు బీజేపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారుజిఎస్టి అంటే గబ్బర్ సింగ్ టాక్స్ అని మొదటి నుండి చెప్తున్నాంపేదలను దోచుకోవడానికి జిఎస్టి తెచ్చారుశవ పేటికలపై, పసి పిల్లల తినుబండారాలపై కూడా జిఎస్టి వేశారుజిఎస్టి ట్యాక్స్ తో ఏదైనా మంచిపని చేశారా..? అని ప్రశ్నించారు.ఆర్థిక సంక్షోభం నుండి తప్పించుకోవడానికే మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందితెలంగాణకు 7 వేల కోట్ల నష్టం వస్తోంది. దీన్ని పూడ్చే బాధ్యత కేంద్రానిదేతెలంగాణ ఎంపీలు, కేంద్ర మంత్రి సంజయ్, కిషన్ రెడ్డి లు తెలంగాణకి వస్తున్న నష్టాన్ని ఎలా పుడుస్తారో చెప్పాలికేంద్రం పెద్దన్న పాత్ర పోషించి అండగా ఉండాలిగుజరాత్ , ఏపీ, బీహార్ లాంటి రాష్ట్రాలను తప్పాజిఎస్టి తెచ్చి పేదల నడ్డి విరిచింది మీరే… ఇప్పుడు తగ్గించింది మీరేజీఎస్టీ తగ్గింపు అంత ఎన్నికల డ్రామా.. ఇంకా జీఎస్టీ ఫలాలు పేదోడి కి అందలేదుజీఎస్టీ స్లాబుల పేరుతో ప్రతి వస్తువు మీద అదనపు పన్నులు వేసి పేదలు మోయలేని భారాన్ని చేశారు.జీఎస్టీ వచ్చి 8 సంవత్సరాలు అయింది.. 8 సంవత్సరాల తర్వాత ప్రజలకు ఇన్ని వేల కోట్లు ఆదా అవుతున్నాయని చెబుతున్నారు.. అంటే 8 సంవత్సరాలు మీరు ప్రజల రక్తం పీల్చుకు తిన్నట్టే కదా..మా నాయకుడు రాహుల్ గాంధీ మొదటి నుండి చెబుతున్నారు.. ఇది జిఎస్టి కాదు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనిఇది సహేతుకంగా లేదు..  స్లాబులు కాదు రేట్లు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.. కాని కేంద్ర ప్రభుత్వ మాత్రం పెడచెవిన పెట్టిందిమీరు తెచ్చిన జీఎస్టీ లో 18,24 శాతలలో ప్రజలు అధికంగా వినియోగించే వస్తువులు చేర్చారు..పది సంవత్సరాలపాటు జీఎస్టీ రూపంలో దోచుకున్నారుగడిచిన ఆరు మాసాల కాలంలో 22 లక్షల కోట్ల ఆదాయం వచ్చిన స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల విశాఖపట్నంలో మాట్లాడారు.. దీనిని బట్టి జీఎస్టీ రూపంలో పిండేసి ఇప్పుడు వెన్నపూసినట్లుగా 5,18 శాతం మాత్రమే పరిమితం చేస్తున్నట్లు చెప్తున్నారుజీఎస్టీ తో నిత్యవసర వస్తువుల ధరలు డబుల్ అయ్యాయి10 రూపాయలు ఉన్న ఉప్పు పాకెట్ 20 రూపాయలు అయింది..60 రూపాయలు ఉన్న కందిపప్పు 160 రూపాయలు అయింది..70 రూపాయలు ఉన్న ఆయిల్ పాకెట్ 160 రూపాయలు అయింది..మీరు వేసిన జీఎస్టీ రొట్టెలు తినే పేదవాడి మీద ఎక్కువ జీఎస్టీ లగ్జరీ వస్తువుల మీద మాత్రం తక్కువ జీఎస్టీ ఉండేది.. ఫైవ్ స్టార్ హోటల్లో ఫుడ్ కి తక్కువ జీఎస్టీ వేస్తే చిన్న హోటల్లో కప్పు టీ కి మాత్రం ఎక్కువ జీఎస్టీ వేసి దోచుకున్నారుపెట్రోల్ ,డీజిల్ జీఎస్టీ లో చేర్చాలని తద్వారా పన్ను రేటు తగ్గి ప్రజలకు మేలు జరుగుతుందని చాలా రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి.. ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తేలేదుమీరు శవ పేటికలకు కూడా జీఎస్టీ వేసారు శవాలను దహనం చేసే సమయంలో చెల్లించే సొమ్ముపై జీఎస్టీ తీసేయాలని  విజ్ఞప్తి చేశారుఇప్పుడు మీరు తగ్గించిన జీఎస్టీ ఫలాలు పేదోడి కి ఎంత వరకు అందుతాయో చూడాలన్నారు. నిన్న తగ్గిన జీఎస్టీ అమలులోకి వచ్చిన పాత ధరలే తీసుకున్నట్లు వార్తలు చూసాంఇన్ని సంవత్సరాల తరువాత ఎన్నికలు వస్తున్నాయని రియలైజ్ అయి జీఎస్టీ తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుందికేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఒక చేతితో ఇచ్చి మరొక చేతితో తీసుకునట్లు ఉందిజీఎస్టీ కౌన్సిల్ ను ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పాటు చేయాలి…కేంద్ర ప్రభుత్వం ది పెత్తనం ఉందితెలంగాణ రాష్ట్రం కొత్త జిఎస్టి వల్ల ప్రతి సంవత్సరం 7000 కోట్ల రూపాయలు నష్టపోతుందిరాష్ట్రాలు నష్టపోతున్న దానిని కేంద్ర ప్రభుత్వమే భరించాలి.. జీఎస్టీ తగ్గించి కేంద్ర ప్రభుత్వం మీ చావు మీరు చావండి అన్న విధంగా వ్యవహరిస్తున్నారుసంక్షేమం మొత్తం రాష్ట్రాల మీద రుద్దుతున్నారు.. కేంద్ర ప్రభుత్వ మాత్రం సెస్ ల పేరుతో దండుకుంటున్నారు జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు 10 సంవత్సరాల పాటు రాష్ట్రాల నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది అని చెప్పారు.. కానీ పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదుఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్న 7 వేల కోట్ల రూపాయల పై మాకు ఎంత ఇస్తారు ప్రామిస్ చేయాలిరాష్ట్రాలు నష్టపోతున్న దానిపై తెలంగాణలోని కేంద్ర మంత్రుల కిషన్ రెడ్డి ,బండి సంజయ్ లు కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడించాలి..మీరు కేంద్రం నుండి స్పష్టత ఇవ్వాలని పొన్నం ప్రబాకర్ స్దిమాండ్ చేసారు.