ఫామ్‌హౌస్‌లో దొరికిన రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదు

Facebook
X
LinkedIn

     లేదని ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్‌ కేసిరెడ్డి

హైదరాబాద్ :

ఫామ్‌హౌస్‌లో దొరికిన రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్‌ కేసిరెడ్డి తెలిపారు. ఎక్కడో దొరికిన డబ్బును లిక్కర్‌ డబ్బులని చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టయిన 12 మంది నిందితులను ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ముందు రాజ్‌ కేసిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్‌హౌస్‌లో దొరికిన రూ.11 కోట్ల డబ్బు గురించి రాజ్‌ కేసిరెడ్డి వివరించారు. ఎక్కడ డబ్బులు దొరికినా అవి లిక్కర్‌ డబ్బులేనని చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రూ.11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సిట్‌ అధికారులు కావాలనే ఆ డబ్బు తనదేనని అబద్ధం చెబుతున్నారని తెలిపారు. 2024 జూన్‌లో ఆ డబ్బును వరుణ్‌కు ఇచ్చినట్లు సిట్‌ అధికారులు చెబుతున్నారని తెలిపారు. నా చేత్తో నేనే ఆ డబ్బును ఇచ్చానని చెబుతున్నారని.. ఆ డబ్బులపై వేలిముద్రలను చెక్‌ చేయాలని కోరారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముద్రించిందో తనిఖీ చేయాలన్నారు. ఆ నోట్లపై నంబర్లను రికార్డు చేయాలని కోరారు.తాను పుట్టకముందు ఉన్న ఆస్తులను కూడా తన బినామీలుగా చూపిస్తున్నారని రాజ్‌ కేసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన వయస్సు 43 ఏళ్లు అని.. కానీ45 ఏళ్ల కిందటి ఫామ్ హౌస్‌కు తాను బినామీ అని చూపిస్తున్నారని అన్నారు. నేను పుట్టకముందే నాకు బినామీ ఆస్తులుంటాయా ? అని ప్రశ్నించారు. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను కూడా అటాచ్ చేశారని తెలిపారు. వారసత్వ ఆస్తులను కూడా లిక్కర్ డబ్బులతో కొన్నట్టు చూపిస్తున్నారని పేర్కొన్నారు. తన బెయిల్‌ను అడ్డుకోవడానికి అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు. రాజ్‌ కేసిరెడ్డి వాంగ్మూలం విన్న ఏసీబీ న్యాయమూర్తి.. సీజ్‌ చేసిన డబ్బులను ఫొటోగ్రాఫ్‌ తీయాలని ఆదేశించారు. అనంతరం నిందితుల రిమాండ్‌ను ఈ నెల 13వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.