డా. వకుళాభరణం అధ్యక్షతన… R. కృష్ణయ్య నేతృత్వంలో బీసీ రౌండ్టేబుల్ సమావేశం
– 90 బీసీ సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలతో డిమాండ్
హైదరాబాద్ :
42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు హైదరాబాద్ లక్డీకపూల్లోని హోటల్ అశోక్లోబిసి కమిషన్ మాజీ చర్మెన్ డా. వకుళాభరణం అధ్యక్షత శనివారం బీసీ అఖిలపక్ష రౌండ్టేబుల్ సమావేశం జరిగింది ee సమావీశానికి మాజీ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్, సామాజిక శాస్త్రవేత్త నరగోని, వివిధ రాజకీయ పార్టి లు, 90 బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత మాత్రమే గ్రామ–నగర స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలన్న డిమాండ్ను 90 బీసీ కుల సంఘాల ప్రతినిధులు తీర్మానాల రూపంలో సమర్థించారు.ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు R. కృష్ణయ్య నేతృత్వం వహించగా, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు అధ్యక్షత వహించారు. ee సందర్బంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ “బీసీలకు రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నప్పటికీ — ఇప్పటివరకు రాష్ట్రపతిని కలిసేందుకు ఒక్క అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని కూడ పంపలేదు. ఇది ప్రభుత్వ వైఖరిపై బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది,” అన్నారు.“ఈ దశలో గవర్నర్ కార్యాలయం తక్షణంగా స్పందించాలి. రాష్ట్రపతికి బిల్లుల సమాచారాన్ని వివరించడంతో పాటు ప్రజల అభిప్రాయాన్ని చేరవేయాలి. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టు మార్గదర్శకాలను అనుసరించి — తగిన డేటా, కమిషన్ నివేదికల తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం మోసం చేస్తే — మండల కార్యాలయాల వద్ద నిరసనలు చేస్తాం, ఎన్నికల ప్రచారం నిలిపేస్తాం. అవసరమైతే ఎమ్మెల్యేలు ఊర్లలో తిరగలేని పరిస్థితులు తలెత్తుతాయి,” అని హెచ్చరించారు.అనంతరం మాజీ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ “బీసీ జనాభా రాష్ట్రంలో 50 శాతం మించినా, ప్రాతినిధ్యం లేకుండా కొనసాగుతున్న తీరును ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. రాజ్యాంగంలోని 243-D(6), 243-T(6) ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలవ్వాలి. ఇది అధికారమిత్రుల కృప కాదని, న్యాయమైన హక్కని గుర్తించాలి,” అన్నారు. సామాజిక శాస్త్రవేత్త నరగోని మాట్లాడుతూ “బీసీలను స్థానిక ఎన్నికల వ్యవస్థ నుంచి దూరంగా ఉంచడం మాత్రమే కాకుండా — కోట్లాది ఓటర్ల అభిమతాన్ని తక్కువ చేయడమే. రాష్ట్రంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన నేతలు కూడా మౌనంగా ఉండటం బాధాకరం. ఈప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా బీసీలు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిని గమనించి తక్షణంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే ఇది సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీసే పరిస్థితులకు దారితీయొచ్చు,” అని పేర్కొన్నారు. సభాధ్యక్షుడు డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ హైకోర్టు తీర్పు ప్రకారం కమిషన్ నివేదికలు, గణాంక ఆధారాలు లేకుండా బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యపడదు. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత చూపలేదు. బిల్లులను రాష్ట్రపతికి పంపినట్టు చెప్పి ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేస్తోంది. ఇది పూర్తిగా బీసీల హక్కులపై ఆటపడే చర్య,” అన్నారు.“ఈ పరిస్థితుల్లో బీసీ సంఘాల ప్రతినిధులతో కూడిన బృందం గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించనుంది. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లిఖితపూర్వకంగా వినతిని అందించి, రిజర్వేషన్ల అమలుపై తక్షణ నిర్ణయం కోరనున్నాం. రాష్ట్రపతిని కలిసేందుకు అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేయాలన్న తీర్మానం కూడా ఈ సమావేశంలో ఆమోదించబడింది,” అని స్పష్టం చేశారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.