సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అసిస్టెంట్ కేర్టేకర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

Facebook
X
LinkedIn

తక్షణమే తొలగింపులను రద్దు చేయాలి

* తొలగించిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి

* పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్

హైదరాబాద్ :

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ కేర్టేకర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ కేర్ టేకర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంద్ర పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు ee ధర్నా కార్యక్రమానికి కృష్ణయ్య ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత పది సంవత్సరాలుగా పనిచేసిన 263 మంది అసిస్టెంట్ కేర్ టేకర్  హాస్టల్లో పిల్లల రక్షణ, శుభ్రత, ఆరోగ్యం బాధ్యత కోసం రాత్రింబగలు అలసిపోయి పనిచేస్తున్నారని సందర్భంగా కృష్ణయ్య పేర్కొన్నారు సొంత పిల్లలను వదిలి చిన్నారులకు తల్లి తండ్రి గా నిలిచిన వీరిని వీరిని ఒక్క నోటీసు లేకుండా ఏలాంటి కారణం లేకుండా గురుకులాల సెక్రటరీ  డాక్టర్ అలుగు వర్షిని  విధుల నుండి అర్ధాంతరంగా తొలగించడాన్ని కృష్ణయ్య తప్పుపట్టారు ఇది కేవలం ఉద్యోగం పోయిందని కాదు ఈ సేవ చేసిన వారిని అవమానమేనని ఆయన పేర్కొన్నారు. ఇది అన్యాయం ఇది బాధ్యత కుటుంబాలపై హార్దిక దాడి అని ఆయన తీర స్థాయిలో మండిపడ్డారు.అసిస్టెంట్ కేర్ టేకర్ సేవలు ఏమి తక్కువ కావన్నారు. రాత్రిళ్ళు పిల్లలతోనే నిద్ర ఆరోగ్య భద్రతపై శ్రద్ధ వ్యక్తిగత శుభ్రత హాస్టల్ భద్రత చిన్నారులకు మనొథైర్యం కలిగించే మానవ సేవలు చేస్తూ వీళ్లు తమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కృష్ణయ్య పేర్కొన్నారు అనంతరం అనంతరం అసిస్టెంట్ కేర్టేకర్లకు ఐక్యవేదిక అధ్యక్షులు పి మహేందర్ మాట్లాడుతూ అసిస్టెంట్ కేర్ టేకర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తక్షణమే తొలగింపులను రద్దు చేయాలని, గుర్తింపు ఇవ్వాలని, తొలగించిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యక్షులు నర్సింగరావు, నిరుప, ప్రధాన కార్యదర్శి బి కర్ణాకర్, కార్యదర్శి నల్లి ఏటి రాజు, కోశాధికారి డి రాజు, ప్రచార కార్యదర్శి వి. మల్లేష్, మహిళా సభ్యులు నిరుప అనేమా, మమత ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.