కాప్రా : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) కీసర మండల కార్యదర్శి గా బంగారు నర్సింగ రావుని ఎన్నుకున్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ప్రజా సమస్యల పరిష్కారం కోసం , కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం , కనీస వేతనాల కోసం , ఉపాధి ఉద్యోగ భద్రత కోసం నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తుందని ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కోసం ప్రజల తరపున పోరాటం నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యాంరంటీలు అమలు చేయాలి. అదేవిధంగా అహ్మద్ గూడా, బండ్లగూడ, రాంపల్లి ప్రాంతంలోని డబల్ బెడ్రూం ఇళ్లకు మరియు రాజీవ్ గృహకల్ప (ఆర్ జీ కే ) నందు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. బోగారం మరియు రాంపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. సిపిఎం పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని బి నర్సింగ రావు ఈ సందర్భంగా తెలియజేశారు.