హైదరాబాద్, :
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. సోమవారం ఆయనను బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఫార్ములా ఈ కేసు విచారణ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి హరీశ్ రావు హాజరయ్యారు. అయితే అప్పటికే ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. మీడియా సమావేశం నడుమ ఆయన అస్వస్థతకు గురికావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వెంటనే కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు కలిసి హుటాహుటిన హరీశ్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చేరిన సమాచారం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.