ఐద్వా కాప్రా సర్కిల్ కార్యదర్శి సఫియా సుల్తానా
తెలుగునాడు, కాప్రా:
పెంచిన బస్ పాస్ చార్జీలు వెంటనే తగ్గించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కాప్రాసర్కిల్ కార్యదర్శి సఫియా సుల్తానా డిమాండ్ చేశారు.బస్ పాస్ రేట్లు పెంచిన నేపథ్యంలో సాధారణ ప్రజలతోపాటు విద్యార్థులు బస్సు పాస్ లపై 20 శాతం పెంచినారు ఆర్డినరీ బస్సు పాస్ ధరలు రూపాయలు 1.150 నుంచి 1.400 రూపాయలు పెంచినారు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు పాస్ రేటు రూపాయలు 1.300 నుంచి రూపాయలు 1.600 లకు పెంచడం జరిగింది బస్సు చార్జీలు 20% పెంచడం వలన పేద మధ్యతరగతి ఒక్కొక్కరికి నెలకు 200 నుంచి 300 రూపాయలు పడుతున్నది కొందరికి సొంత ఇల్లులు లేక కిరాయి ఇంట్లో ఉండి కిరాయి కట్టలేక ఇబ్బంది పడుతున్నారు.మరో పక్కన కొందరికి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. ఒక పక్కన నిత్యవసర ధరలు పెరుగుతున్నవి. మరో పక్కన బస్ చార్జీలు పెంచుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోని సామాన్య ప్రజలకి భారం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వందే. పాతబస్ చార్జీలన్నీ యధావిధిగా కొనసాగించాలి. ప్రజలు ఆర్టీసీ రవాణాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.స్కూల్ విద్యార్థుల పైన బస్సు పార్సుల పడే భారాన్ని చదువుని దూరం చేస్తున్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి, ఆ భారాన్ని ఇప్పుడు పాసుల ద్వారా పొందాలనుకోవడం సమంజసం కాదన్నారు. పెంచిన బస్సు పాస్ చార్జీలను ఉపసంహరించుకోవాలిని,
లేనిచో పెద్ద ఎత్తున మహిళలందరూ కలిసి ఆందోళన చేస్తాము అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ( ఐద్వా ) కాప్రా సర్కిల్ కార్యదర్శి సఫియా సుల్తానా డిమాండ్ చేశారు.