జూబ్లీహిల్స్ :
రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్త మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రి ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు.

మంత్రివర్గంలో మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.