పెంచిన బస్సు పాస్ చార్జీలు వెంటనే తగ్గించాలి

Facebook
X
LinkedIn

సిపిఎం పార్టీ కాప్రా సర్కిల్ కార్యదర్శి జి. శ్రీనివాసులు డిమాండ్

తెలుగునాడు,, కాప్రా :

బస్ పాస్ చార్జీలను 20%పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించి బస్సు పాస్ చార్జీలన్ని యధావిధిగా కొనసాగించాలని సిపిఎం పార్టీ కాప్రా కార్యదర్శి జి. శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు చార్జీలను 20 శాతం పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల పైన ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు . దీనివలన హైదరాబాదు నగర పరిధిలో ఒక్కొక్కరికి నెలకు 200 నుండి 300 రూపాయలు ఆర్థిక భారం పడుతుందని తెలిపారు.

దీనితో ప్రజలు ప్రజా రవాణాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. పేద మధ్యతరగతి స్కూల్ విద్యార్థుల పైన భారం పడుతుందని వెల్లడించారు. ఎన్నికలలో రాజకీయ లబ్ధి కోసం మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం అరకొర బస్సులతో ఏర్పాటుచేసి, ఆ భారాన్ని ఇప్పుడు బస్సు పాసుల పైన సమకూర్చుకోవడం దారుణమని విమర్శించారు. కావున పెంచిన బస్సు పాసు చార్జీలను వెంటనే ఉపసంహరించాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడతామని పేర్కొన్నారు.