బిపిసిఎల్ చర్లపల్లిలో డ్రైవర్లకు కార్మిక హక్కులు అమలు చేయాలని డిమాండ్

Facebook
X
LinkedIn

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.చంద్రశేఖర్

హైదరాబాద్ :

బిపిసిఎల్ చర్లపల్లి ఆయిల్ సెక్టార్‌లో లారీ ట్యాంకర్లపై పనిచేస్తున్న డ్రైవర్లకు కనీస వేతనాలు, ఈఎస్ఐ, పిఎఫ్, 8 గంటల పని హక్కులు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
ఈ డ్రైవర్లు రెండు రోజులుగా కొనసాగిస్తున్న నిరసనలకు సీఐటీయూ నాయకుడు గణేష్ మద్దతు తెలుపుతూ.. కార్మికులు ఐకమత్యంగా పోరాడి తమ హక్కులు సాధించుకోవాలన్నారు. ఈ సందర్భంగా 94 మంది కార్మికులు సీఐటీయూ యూనియన్‌లో చేరారు.

అనంతరం జె.చంద్రశేఖర్ మాట్లాడుతూ యూనియన్ స్థాపన వల్ల కార్మికుల హక్కులు, చట్టాల ప్రయోజనాలు లభిస్తాయని వివరించారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు జి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కార్మిక కోడ్‌లు, ట్రాన్స్‌పోర్ట్ బిల్లుతో కార్మిక హక్కులు హరించబడుతున్నాయన్నారు. డ్రైవర్లపై అన్యాయమైన నిబంధనలు విధించడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా డ్రైవర్ల సంఘం సీఐటీయూ అనుబంధంగా ఏర్పాటు చేయాలని తీర్మానించడంతో 13 మందితో నూతన కమిటీ ఏర్పడింది. ప్రధాన కార్యదర్శిగా అశోక్, ఉపాధ్యక్షులుగా షరీఫ్, మల్లేష్, సంయుక్త కార్యదర్శిలుగా అంజి, నాగస్వామి, కార్యనిర్క కార్యదర్శిగా రాజిరెడ్డి, కోశాధికారిగా చెన్నకేశవ,
కమిటీ సభ్యులుగా మహేష్, గంగాధర్, ఎస్ రాజు, కుమార్ స్వామి, నాగేందర్ రెడ్డి
తదితరులుగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.