నాచారంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

నాచారం డివిజన్లోని సాయి నగర్లో మిగిలి ఉన్న భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి 5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించడం అయినది.
అలాగే ఇందిరానగర్ వీధి నెంబర్ 11 మరియు 12లల్లో కొత్తగా సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు 25 లక్షల రూపాయలు మంజూరు చేయించడం అయినది. ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ఈ పనులకు భూమి పూజ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నాచారం డివిజన్లో ఇలాంటి భూగర్భ డ్రైనేజీ సమస్యలు కానీ సిమెంట్ రోడ్ల సమస్యలు లేకుండా డివిజన్ ను ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో AE కీర్తి మరియు వినీత్ వర్క్ ఇన్స్పెక్టర్ విజయకుమార్ జలమండలి సిబ్బంది మరియు BRS నాయకులు కార్యకర్తలు మరియు ఇందిరానగర్ వాసులు అలాగే సాయి నగర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.