యాదగిరిగుట్ట :
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండో -యూకే గ్రీన్ బయో డైవర్ సిటీ అడ్వకేట్ క్స్ లెన్స్ అవార్డు – 2025 ను ఎస్.వీ.ఎన్ డిజిటల్ స్కూల్ వ్యవస్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ గురువారం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ చేతుల మీదుగా అందుకున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని హయగ్రీవ వేద పాఠశాల ఆవరణలో జరిగిన నవగ్రహ వన ప్రతిష్టా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అవార్డును అందజేశారు. ఎకో ప్రమోటర్ గా గొట్టిపర్తి భాస్కర్ చేస్తున్న సేవలను గుర్తించిన ఈసీజీ ఇండో యూకే గ్రీన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా ఎస్.వీ.ఎన్ విద్యా సంస్థ ద్వారా వేలాది మొక్కల నాటడంతోపాటు ప్రస్తుతం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా ఆయన విశేష సేవలందిస్తున్నారని కొనియాడారు. గొట్టిపర్తి భాస్కర్ మొక్కలను నాటడంలోనూ, మొక్కలను నాటి సంరక్షించడంలోనూ విశేషమైన కృషి చేశారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం, ఈసీజీ ఇండో యూకే అధ్యక్షులు డాక్టర్ రవీందర్ కార్యదర్శి మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.