మిస్ వరల్డ్ ఓపల్ సుచాట చుంగ్‌సీ కి అభినందనలు

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాట చుంగ్‌సీ తో పాటు ఇతర కేటగిరీల విజేతలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో ఇచ్చిన తేనీటి విందుకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 72వ మిస్ వరల్డ్ పోటీల విజేతలను గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీల విజేతలు మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక వైభవం తమను ఎంతో ఆకట్టుకున్నదని, తెలంగాణను చిరస్థాయిగా గుర్తుంచుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు , పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , ఇతర ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.