మేడ్చల్ జిల్లా రాష్ట్ర అవతారనోత్సవాలలో…

Facebook
X
LinkedIn

తెలుగునాడు, మేడ్చల్ జిల్లా ప్రతినిధి :

రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా లో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ముఖ్య అతిథులుగా జాతీయ పతాకాల ఆవిష్కర్తల 32 జిల్లాల రాష్ట్ర జాబితాను ప్రభుత్వం విడుదల చేస్తూ జీవో జారీ చేసింది చేసింది. ఈ మేరకు మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లాలో డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ముఖ్య అతిథి గా పాల్గొంటారని ప్రకటించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగే వేడుకలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఉపన్యసించి, అవార్డులు సైతం ప్రధానం చేస్తారు. గతంలో మంత్రిగా మహేందర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అనంతరం వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వం తరఫున రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో జాతీయ పథకాన్ని ముఖ్యఅతిథిగా ఆవిష్కరించిన విషయం విధితమే. మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జరిగే వేడుకలకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, రాజకీయ నాయకులు, సీనియర్ సిటిజన్స్ అందరు పెద్ద ఎత్తున హాజరు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.