కోలా వీరలక్ష్మి సాయక్క (95) కన్నుమూత..

Facebook
X
LinkedIn

సాక్షి రిపోర్టర్ వెంకన్న మాతృ యోగం

తెలుగునాడు, మేడ్చల్ జిల్లా ప్రతినిధి :

ఘట్కేసర్ మండలంలోని పోచారం ప్రాంతానికి చెందిన కోల వీరలక్ష్మి సాయక్క (95) శుక్రవారం ఉదయం పరమపదించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, పోచారం నీలిమ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు.వార్త తెలిసిన వెంటనే సిపిఎం పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆమె నివాసానికి చేరుకొని, పార్దివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె కుమారుడు కోలా వెంకటేశ్వరరావు ను పరామర్శించారు.

కోలా వెంకటేశ్వరరావు ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలోని ప్రముఖ తెలుగు దినపత్రిక ‘సాక్షి’లో జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌గా సేవలందిస్తున్నారు. నివాళులు అర్పించిన వారిలో సాక్షి తెలంగాణ రెసిడెంట్ ఎడిటర్ ఎస్.విజయకుమార్ రెడ్డి, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ డి.జి.నరసింహారావు, హనుమకొండ జిల్లా పార్టీ కార్యదర్శి ప్రభాకర్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం, సీనియర్ నాయకులు చింతల యాదయ్య, కిష్టప్ప, ఘట్కేసర్ మండల కార్యదర్శి ఎన్.సబిత, దాస్ తదితరులు పాల్గొని కుటుంబానికి సానుభూతి తెలిపారు. వారి సేవలను, కుటుంబానికి ఆమె అందించిన మద్దతును స్మరిస్తూ పలువురు నాయకులు ఆమె మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు.కోల వీరలక్ష్మి సాయక్క జీవితం అంతా సాధారణ కుటుంబ బాధ్యతలకే గాక సామాజిక స్పృహకూ దర్పణంగా నిలిచింది. తన కుటుంబాన్ని సామాజిక దృక్పథంతో తీర్చిదిద్దిన ఆమె, కొడుకు పాత్ర మీడియా రంగానికి ఓ చక్కని వ్యక్తిత్వాన్ని అందించిన ఘనత ఆమెకే చెందుతుంది. గ్రామంలో ప్రజాతంత్ర ఉద్యమానికి అండగా నిలిచారు. ఆమె మరణం కుటుంబానికి, స్నేహితులకు, సమాజానికి తీరనిలోటు.ఆమెకు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. ఆమె అంత్యక్రియలు పోచారంలో నిర్వహించారు. నివాళులర్పించిన వారిలో మేడ్చల్ జిల్లా రిపోర్టర్లు, జర్నలిస్ట్ సంఘం నేతలు మల్కయ్య, వెంకట్ రెడ్డి, రవిచంద్ర, రామారావు, బాల్ రెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణ, విజయ్ కుమార్ పటేల్ నర్సింహా, ఆంజనేయులు, అశోక్, గుమ్మడి హరిప్రసాద్, సైన్స్ రంగం సభ్యులు ఎం.శ్రీనివాస్, వి.శ్రావణ్ కుమార్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.